భారత రాజ్యాంగం ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కథ 1934లోనే మొదలైంది. కమ్యూనిస్టు నేత ఎం.ఎన్. రాయ్ తొలిసారిగా భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణ సభ(రాజ్యాంగ పరిషత్) అవసరమని ప్రతిపాదించారు. ఈ ఆలోచనకు బలం చేకూర్చుతూ, 1935లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ఈ డిమాండ్ను ముందుకు తెచ్చింది.
Click here to Read the English version of this article.
1938లో జవహర్లాల్ నెహ్రూ, “వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికై, భారతీయుల చేతుల మీదుగా మాత్రమే స్వతంత్ర భారత రాజ్యాంగం రూపొందించబడాలి” అని ప్రకటన చేశారు. ఈ భావనను కాంగ్రెస్ 1939లో ఒక తీర్మానంతో మద్దతు ఇచ్చింది.
1940లో బ్రిటిష్ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ మద్దతు కోసం ఆగష్టు ఆఫర్ ద్వారా ఈ డిమాండ్ను సూత్రప్రాయంగా అంగీకరించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆమోదించడానికి వీలుగా సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలోని క్రిప్స్ మిషన్ ను ఏర్పాటు చేసి బ్రిటీష్ ప్రభుత్వం కేబినెట్ సభ్యుడైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ను ఒక ముసాయిదా ప్రతిపాదనతో భారత్కి 1942లో పంపింది. కానీ ముస్లింలీగ్ రెండు రాజ్యాంగ సభలు కావాలంటూ, భారతదేశం రెండు స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాలుగా విభజింపబడి ఉండాలని ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో ముస్లిం లీగ్ వైఖరి కారణంగా విఫలమైంది.
తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం 1946 మార్చి 24న లార్డ్ పెథిక్ లారెన్స్ నేతృత్వంలోని కేబినెట్ మిషన్ ను భారత్ కు పంపి కీలక మార్పు తెచ్చింది. ఈ బృందంలో లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్ట్ క్రిప్స్ మరియు ఎ.వి.అలెక్జాండర్ సభ్యులుగా ఉన్నారు. మే 16, 1946న వారు ప్రకటించిన ప్రణాళిక రెండు వేర్వేరు రాజ్యాంగ సభల ప్రతిపాదనను తిరస్కరించి, ఏకైక రాజ్యాంగ సభ ద్వారానే రాజ్యాంగ నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేసింది.
ఈ విధంగా, అనేక సవాళ్లు, చర్చల మధ్య ఏర్పడిన రాజ్యాంగ నిర్మాణ సభ, భారత స్వాతంత్ర్యానికి పునాది వేసింది. అదే సభ, 1950లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించింది.
🎯 రాజ్యాంగ సభ ఆలోచన నుంచి ఆచరణ వరకు… ఏ దశ మీ హృదయానికి దగ్గరగా అనిపించింది?
💬 కామెంట్స్లో చెప్పండి…
